Breaking : లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

Update: 2026-02-20 12:14 GMT

tirumala laddu adulteration 

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఏర్పాటయిన ఈ కమిటీ దీనిపై విచారణ చేయనున్నారు. నలభై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీటీడీ నిబంధనలు, అమలు పరిశీలనలో జరిగిన పొరపాట్లను ఈ కమిటీ విచారించనుంది. టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన అవకతవకలపై అథ్యయనం చేయనుంది.

45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని...
నిర్ణయాలు సరైన విధానంలో తీసుకున్నారా? లేదా? అన్నది ఈ కమిటీ సమీక్షించనుంది. ఏకసభ్య కమిటీకి తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన సహకారాన్ని అందించాలని కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో నెయ్యి కల్తీ ఘటనపై సింగిల్ మెన్ కమిటీని నియమిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News