శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ క్రికెటర్ల శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది

Update: 2025-11-07 07:13 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ క్రికెటర్ల శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. రెండున్నర కోట్ల రూపాయల నగదును ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిశ్చయించింది. దీంతో పాటు కడపలో ఇంటిని నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చంద్రబాబు తనతో...
తనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఈ విషయాలను తెలపారని శ్రీచరణి మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని, అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారని, మరింత మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తనతో అన్నారని శ్రీచరణి తెలిపారు.


Tags:    

Similar News