సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ చేశారు. రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా అథారిటీ సమీక్షించనుంది. ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష జరిగింది.
రాజధాని అమరావతిలో...
రాజధాని అమరావతిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించి చర్చించి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియచేయనుంది. జరీబు- మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించే అంశంపై నిర్ణయం అథారిటీ సమావేశం తీసుకోనుంది. సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.