Achennaidu : తాను క్షమాపణ చెప్పినా వైసీపీ సభ్యులు అడ్డుకోవడమేంటి?

శ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Update: 2026-03-04 12:45 GMT

క‌లియుగ దైవం తిరుమ‌ల‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి విశ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంశం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ పాకులాడుతోంద‌ని ఆరోపించారు. గ‌తంలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంపై సీఎం నారా చంద్రబాబు నాయుడుఎన్డీడీపీ రిపోర్ట్‌లో ఉన్న అంశాలనే సభలో చదివారని స్పష్టం చేశారు. దీనిని వక్రీకరించి ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటైందని మండిపడిన ఆయన, ఇండిపెండెంట్ స‌భ్యుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన విమర్శలను ఖండిస్తూ, ప్రజలు ఛీ కొడతారని అసలు అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. బట్ట కాల్చి మీద వేయడం వైసీపీ నేతలకు కొత్త కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మండలిలో వైసీపీ సభ్యుల ప్రసంగానికి అడ్డుపడుతున్నారన్న తోట త్రిమూర్తులు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చానని తెలిపారు.

చర్చను పక్క దోవ పట్టిస్తూ...
చర్చను ఇందాపూర్ ప్రస్తావనతో డైవర్ట్ చేస్తున్నది వైసీపీయేనని తెలిపారు. శ్రీవారి భక్తుడిగా తనకు తీవ్ర వేదన కలుగుతోందని పేర్కొంటూ, జగన్‌కు వెంకటేశ్వరస్వామిపై నమ్మకం లేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. ఇంత కక్ష ఎందుకో వైసీపీ స‌భ్యులు చెప్పాలని ప్రశ్నించారు. అయితే తన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాటిని ఉపసంహరించుకుని సభకు క్షమాపణ తెలిపారు. తన వివరణతో చైర్మన్ సంతృప్తి చెందినట్లు తెలిపారు. ఎవరి మత విశ్వాసాలు వారివి. నా వ్యాఖ్యల్లో ఏమైనా తప్పుంటే చెప్పండి అని స్పష్టం చేశారు. అదే సమయంలో జగన్ క్రిస్టియన్ అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేస్తూ, హిందువులను బాధపెడుతున్న జగన్ తరఫున వైసీపీ సభ్యులే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాయిదా తర్వాత కూడా వైసీపీ సభ్యులు నినాదాలతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని విమర్శించిన మంత్రి, తాను ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.


Tags:    

Similar News