Andhra Pradesh : మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు

మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2026-02-26 11:57 GMT

మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం 2027 గోదావరి పుష్కరాల పై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఉప సంఘం సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, బి. సి జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్, మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఐదు అంశాలపై భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. గత భేటీలోని అంశాలు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చ జరిగింది. దాదాపు 8 నుంచి10 కోట్ల మంది పుష్కరా స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలు 6 జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. 4516 మీటర్ల మేర 373 ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను రూపొందించారు.

ఘాట్ల సంఖ్య పెంపునకు...
గతంలో ఉన్న 234 ఘాట్ల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకోవాని సమావేశం నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో(తొలి, వీకెండ్, అమావాస్య) దాదాపు కోటి మంది వస్తారని అంచనా వేసి, పవిత్ర స్నానానికికి 2.25 కోట్లు వస్తారని అంచనా వేసింది. భక్తుల సౌకర్యార్థం పిండ ప్రదానం ఘాట్లు, శానిటేషన్ ప్రక్రియ, రోడ్లు, వాటర్ తదితర విషయాల్లో పక్కా ప్రణాళిక ఉండాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి జిల్లాలో 102 ఘాట్లు, పశ్చిమ గోదావరి 40, కోనసీమ 175, ఏలూరు 36, కాకినాడ 5, పోలవరం జిల్లాలో 11 ఘాట్లు మొత్తంగా 369 ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొదటి గోదావరి పుష్కర ఘాట్ పోలవరం జిల్లాలో గుండాల, చివరి ఘాట్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది మరియు బలుసుతిప్ప, కాకినాడలో గోవలంక ఘాట్, వెస్ట్ గోదావరి లో నర్సాపురం ఘాట్ అని కమిటీ వెల్లడించింది. భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. శాఖల మధ్య సమన్వయము కోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News