ఏపీలో ఆరో జోన్లు.. రెండు మల్టీ జోన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2025-12-16 07:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇరవై ఆరు జిల్లాల ఆధారంగా కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌-1975 ప్రకారం ఉన్న జోనల్‌ నిబంధనలను కేంద్రం సవరించింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత కేడర్‌, జోనల్‌, మల్టీ జోన్లపై స్పష్టతనిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. ఏడేళ్లు ఒకేచోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణనలోకి తీసుకోవాలని ఉతర్వుల్లో పేర్కొన్నారు.

మల్టీ జోన్‌-1 :
జోన్‌-1 : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలు.
జోన్‌-2 : అల్లూరి సీతారామరాజు, తూ.గో., కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు.
జోన్‌-3 : ప.గో., ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు.
మల్టీ జోన్‌-2 :
జోన్‌-4 : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.
జోన్‌-5 : తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు.
జోన్‌-6 : నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు


Tags:    

Similar News