వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం కావడంతో ఆయన కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఆయన విచారణ పూర్తయిన తర్వాత ఈ సాయంత్రం తిరిగి అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళతారు. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.