సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Update: 2017-06-09 06:13 GMT

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గోవర్ధన్ రెడ్డి తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయి తో పాటు హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో సీఎం మాట్లాడి .. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కులు లో చనిపోయిన పాల్వాయి మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వ పరంగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి s p సింగ్ , ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ను సీఎం ఆదేశించారు. మృత దేహం తరలింపు తో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీ లు కె. కేశవ రావు, జితేందర్ రెడ్డి లను సీఎం కోరారు.

Similar News