శాతకర్ణికి హైకోర్టు నోటీసులు

Update: 2017-03-28 08:44 GMT

నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమి పుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహియించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు విచారణ జరిగింది. దీనిపై గౌతమి పుత్ర శాతకర్ణి హీరో బాలకృష్ణతో పాటుగా, ఆ చిత్ర దర్శకుడు, నిర్మాతలకు కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గౌతమి పుత్ర శాతకర్ణికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు ను ఇచ్చిన సంగతి తెలిసిందే. రుద్రమ దేవి సినీ నిర్మాతకు కూడా నోటీసులు జారీ చేసింది.

Similar News