వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు పుస్తకం

Update: 2017-07-08 06:08 GMT

వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీలో చంద్ర బాబు నాయుడు మూడేళ్ళ పాలనపై పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందనే ఆరోపణలను సాక్ష్యాలతో పుస్తకంలో పేర్కొన్నారు. జులై 5 వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల పేరుతో అస్మదీయులకు కట్టబెట్టిన వైనాన్ని వివరించారు. గత ఏడాది అవినీతి చక్రవర్తి పేరుతో అవిష్కరించిన పుస్తకాన్ని అప్ డేట్ చేసి ముద్రించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 56 ప్రాజెక్ట్ లలో చోటు చేసుకున్న అవినీతిని ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు

Similar News