ఉదయం ప్రారంభమై వాయిదా పడిన లోక్ సభ తిరిగి 12గంటలకు ప్రారంభమైంది. అయితే మళ్లీ టీడీపీ, వైసీపీ ఆందోళనలతో లోక్ సభ దద్దరిల్లిపోయింది. సభా కార్యక్రమాలను నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే కోరారు. అయితే ఎంపీలు ఎవరూ ఆందోళనలు విరమించకపోవడం, నినాదాలతో హోరెత్తించడంతో లోక్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.