ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనేదే జగన్ పన్నాగమని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. జగన్ యువతను రెచ్చగొట్టి వారిపై కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి మణిక్యాలరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని,,,80% మంది ప్రజలు టీడీపి వైపు ఉన్నారని తెలిపారు. తుని సంఘటనపై దర్యాప్తును సీఐడీ చూసుకుంటుందని, ఆ తరువాతయాక్షన్ తీసుకుంటుందన్నారు. కాపు రిజర్వేషన్ లను టీడీపీ మాత్రమే ఇవ్వగలదని, కాపులకు రాజకీయ రిజర్వేషన్లు లేకున్నా, విద్యా,ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని సీఎం ని కోరుతామన్నారు. కాపులపై ఇంత ప్రేమ ఒలక పోసే జగన్,, వైసీపీ ప్లీనరీలో కాపుల గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.