మోడీకి బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2018-04-20 05:07 GMT

ప్రధాని నరేంద్రమోడీకి హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. తెలుగోడి దమ్ము, ధైర్యం చూపించాలన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, పరీక్షిస్తే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని బాలయ్య మోడీకి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో బాలయ్య ప్రసంగించారు. మోడీ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను విభజిస్తూ పాలిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ టీలో పడిన ఈగలా కొట్టుకుంటుందని, దాన్ని తీసి బతికించాల్సిన మోడీ టీతో పాటు దాన్ని నమిలి మింగేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలా చేస్తూ పోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు బాలయ్య బాబు. ముందు భార్యను గౌరవించడం నేర్చుకోవాలని మోడీపై నిప్పులు చెరిగారు.

Similar News