గుజరాత్ లో అధికారంలోకి వచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గంలో మాత్రం కాషాయ పార్టీ చతికలపడింది. మోడీ సొంత నియోజకవర్గమైన ఉన్జా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. బీజేపీ అభ్యర్థి పటేల్ నారాయణ్ భాయ్ ని కాంగ్రెస్ అభ్యర్థి ఆశాపటేల్ ఓడించారు. దాదాపు ఇరవై వేల కు పైగా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. మోడీ సొంత గ్రామం వాద్ నగర్. ఈ వాద్ నగర్ కూడా ఉన్జా నియోజకవర్గంలోనే ఉంది. గుజరాత్ లో పవర్ లోకి వచ్చిన మోడీ సొంత ఊరిలో పరాభవం చూడాల్సి వచ్చిందని బీజేపీ నేతలు మధనపడుతున్నారు.