మంత్రి అచ్చెన్న ఈ మహిళను బూటు కాలితో తన్నారా?

Update: 2017-03-17 11:08 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తనను బూటు కాలితో తన్నారని ఒక మహిళ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద కల్యాణి అనే మహిళ ఆందోళనకు దిగింది. తనకు కొన్ని నెలలుగా జీతం రావడం లేదని, ఆ విషయంపై మంత్రిని కలిసేందుకు అనేకసార్లు ప్రయత్నించానని కల్యాణి చెబుతోంది. అయితే చివరకు మంత్రి కలవడంతో తన బాధను వివరించానని, అయితే మంత్రి తనను బూటు కాలితో తన్ని అవమానించారని కల్యాణి చెబుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె చెబుతోంది. తనకు న్యాయం చేయాలని కల్యాణి డిమాండ్ చేస్తోంది.

అయితే మంత్రి అనుచరులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. కావాలనే మంత్రి అచ్చెన్నాయుడుపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వారంటున్నారు. మొత్తం మీద సిక్కోలు జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.

Similar News