పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఏపీ ఎంపీల రగడతో లోక్ సభను మార్చి 5వ తేదీకి స్పీకర్ సుమిత్ర మహాజన్ వాయిదా వేశారు. సేవ్ ఆంధ్ర్రప్రదేశ్ నినాదాలతో లోక్ సభ దద్దరిల్లిపోయింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. రాజ్యసభను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేశారు.