బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి షాక్

Update: 2017-11-01 13:50 GMT

టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ఆయనకు అత్యంత సన్నిహితుడు కంచర్ల భూపాల్ రెడ్డి షాకిచ్చారు. కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ లోచేరారు. నల్లగొండ కు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కంచర్ల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇటీవల చంద్రబాబుతో విజయవాడలో జరిగిన సమావేశం వివరాలను మీడియాకు లీక్ చేశారని ఆయనకు టీటీడీపీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. చంద్రబాబు సమావేశం అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి రేవంత్ ను కావాలనే కొందరు పంపించేశారని ఆరోపించారు. అయితే రేవంత్ వెంట కాంగ్రెస్ లో చేరితే తనకు నల్లగొండ టిక్కెట్ దక్కదని భావించిన కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిపోయారు. రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కంచర్ల టీఆర్ఎస్ లో చేరడం రేవంత్ కు షాక్. మరోవైపు కొడంగల్ కు చెందిన పలువురునేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలను కొద్దిసేపటి క్రితం కప్పుకున్నారు.

Similar News