పటేళ్లు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనూ కాంగ్రెస్ కు పెద్దగా ఓట్లు రాలలేదు. ముఖ్యంగా హార్థిక్ పటేల్ రిజర్వేషన్ ఉద్యమం, ఆయన కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో పటేళ్ల ప్రాంతమైన సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లలో కాంగ్రెస్ కు అధికసీట్లు వస్తాయని అంచనా వేశారు. కాని ఆ ప్రాంతంలోనూ ఈ అంశం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇక్కడ కూడా బీజేపీయే ముందంజలో ఉండటం విశేషం. వస్తున్న ఫలితాలను బట్టి చూస్తుంటే పాటీదార్ల ఉద్యమ ప్రభావం పెద్దగా పనిచేయనట్లుంది.