రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థులు సంతోష్ కుమార్, లింగయ్య , బండ ప్రకాష్ లు విజయం సాధించారు. సంతోష్ కుమార్ కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ కు 32 ఓట్లు, బండ ప్రకాష్ కు 33, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు పది ఓట్లు వచ్చాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలనూ గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారు కూడా ఆ పార్టీకి ఓటు వేయలేదు.