బ్రేకింగ్ : ఓయూలో ఉద్రిక్తత కారణంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా

Update: 2017-12-21 03:30 GMT

జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఇండియన్ కాంగ్రెస్ సభలు హైదరాబాద్ లో జరగాల్సి ఉంది. అయితే తొలుత ఉస్మానియా యూనివర్సిటీలో ఈ మహాసభలను జరుపుదామనుకున్నారు. ఓయూలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వేదిక మరొక చోటకు మారుద్దామని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలను నిరవధిక వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓయూలో ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News