ఎన్డీఏకు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పింది. పొలిట్ బ్యూరో సభ్యులతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈరోజు సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో చంద్రబాబు వెంటనే నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పెట్టే అవిశ్వాసం తీర్మానానికి మద్దతిచ్చే కన్నా టీడీపీఏ ఎన్డీఏ నుంచి వైదొలగి అవిశ్వాసం తామే పెట్టాలని నిర్ణయించింది. ఉదయం నుంచి ఏపీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మనమే లీడ్ తీసుకోవాలని చంద్రబాబు భావించారు.