ఆర్కే నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే, దినకరన్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. అధికార పార్టీకి చెందిన వారినే లోపలికి అనుమతిస్తున్నారని ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులను తోసేసి లోపలికి వెళ్లేందుకు కొందరు నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది.