నిజామాబాద్ జిల్లా అభంగపట్నంలో దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళితులైన లక్ష్మణ్, రాజేశ్వర్ లును భరత్ రెడ్డి నీటిగుంతలోకి దింపి చితకబాదారు. అయితే బాధితులు ఇది దొరల రాజ్యం సినిమా షూటింగ్ అని తొలుత చెప్పారు. తర్వాత పోలీసులకు వాస్తవ విషయాన్ని వెల్లడించారు. గత 22 రెండురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న భరత్ రెడ్డిని నిజామాబాద్ పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.