సికింద్రబాద్లోని ప్రశాంత్ థియోటర్లో దారుణం చోటు చేసుకుంది... ఒక యువతిని అతి దారుణంగా రేప్ చేశాడు ఓ జేసీబీ డ్రైవర్. ఆ డ్రైవర్ పేరు బిక్షపతి. రెండు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది ఓ యువతి.15 రోజుల క్రీతం ఒకరినొకరు కలుసుకున్నారు. యువతిని ప్రేమిస్తున్నానంటూ బిక్షపతి చెప్పాడు. గత నెల 29న ఉదయం సికింద్రబాద్లో కలుసుకుని.... ఇందిరాపార్క్ కు తీసుకెళ్లాడు..తరువాత మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకున్నారు. ప్రశాంత్ థియేటర్ లో బాల్కని టిక్కెట్ తీసుకుని పద్మావత్ సినిమాకు తీసుకెళ్లాడు. బాల్కనీలోనే బిక్షపతి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అయితే యువతి తండ్రి ఒక ప్రధాన గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో బిక్షపతిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.