జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన అన్న చిరంజీవే శాపమని పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కు రాజీకయాలెందుకని ప్రశ్నించారు. హాయిగా సినిమాలు చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని జేసీ అన్నారు. పవన్ కల్యాణ్ వల్ల టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదన్న జేసీ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే అతి పెద్ద తప్ప అని చెప్పారు. మొత్తం మీద పవన్ పై జేసీ ఘాటు కామెంట్లు చేశారు.