ఆధిక్యంగా దూసుకుపోతున్న దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గుర్తు ముఖ్యం కానది, వ్యక్తి ముఖ్యమని తేలిపోయిందన్నారు. ఆర్కేనగర్ తీర్పే ప్రజలు తీర్పుగా ఆయన అభివర్ణించారు. దినకరన్ కి ఇప్పటి వరకూ 15638 ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకేకు 7038 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. డీఎంకే మూడో స్థానానికే పరిమితమయిపోయింది. దినకరన్ ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు. కాగా అన్నాడీఎంకే పగ్గాలను దినకరన్ కు అప్పగించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.