తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నెల14వ తేదీన ఉమామాధవరెడ్డితో పాటు ఆమె కుమారుడు సందీప్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మరో సీనియర్ నేత టీడీపీకి షాక్ ఇచ్చి వెళ్లిపోనున్నారు.