జగన్ పాచిక పారలేదు !

Update: 2016-03-28 19:13 GMT

టిడిపిలో చేరు తారన్న ప్రచారం నేపథ్యంలో జ్యోతుల నెహ్రును పార్టీలో ఉండేలా చేసేందుకు వైసిపి అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన సన్నిహితులతో జరిపిన దౌత్యం వికటించినట్లు తెలు స్తోంది. దీం తో టిడిపిలోకి జ్యోతుల నెహ్రు రంగ ప్రవేశం ఖాయమన్న ప్రచారం ఊపందుకొంది. ఆది వారంనాడు వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంతనాలు నిర్వహించారు. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఉన్న జ్యోతుల నెహ్రూతోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు త్వరలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో. ఆయనతో మాట్లాడాలని చెవి రెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరడంతో రంగంలోకి దిగిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూతో మంతనాలు నిర్వహించారు. అనంతరం ఫోన్ లో జగన్‌తో మాట్లాడాలని చెవిరెడ్డి కోరినప్పటికీ నెహ్రూ కుదరదని తెలిపినట్లు సమాచారం. అంతేగాక రాజకీయం వేరు, స్నేహం వేరని తెలుపూతూ తన దగ్గ రకు వచ్చే రాయబారులను జ్యోతుల నెహ్రూ తిప్పిపంపుతున్నట్లు తెలిసింది.

Similar News