జగన్ నెంబర్ ఈసారి 150

Update: 2018-04-04 07:34 GMT

సినిమాల్లో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వారిలాగా, బజ్జీలు, బోండాలు అమ్ముకునే వారిలాగా, బస్సుల్లో టిక్కెట్లు అమ్ముకునే వారిలాగా చంద్రబాబు నాయుడు అన్ని జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. . చంద్రబాబు ఢిల్లీ వచ్చింది ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాధించడానికి కాదని, స్వప్రయోజనాలకే వచ్చారన్నారు. యూటర్న్ బోర్డు కన్పించినప్పుడల్లా తనకు చంద్రబాబే గుర్తుకొస్తున్నారన్నారు. ఫ్లోర్ లీడర్లను బతిమాలుకుంటూ ఫొటోలు దిగడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదన్నారు. చక్రాలు లేని సైకిల్ పై చంద్రబాబు తిరుగుతున్నారన్నారు. చంద్రబాబును ఏ పార్టీ బలపర్చే అవకాశం లేదని, బాబు క్రెడిబిలిటీ కోల్పోయారని విజయసాయి అభిప్రాయపడ్డారు. ఏపీలో ఫ్యాన్ జోరుగా తిరుగుతుందని, అన్ని పార్లమెంటు స్థానాలతో పాటు, ఏపీలో 150 స్థానాలు వైసీపీకే వచ్చే ఎన్నికల్లో వస్తాయని, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. చంద్రబాబు పార్లమెంటు ఎదుట మొక్కడం సినిమా ఫీట్ ను తలపిస్తుందన్నారు.

Similar News