గాలికి మరో షాక్...!

Update: 2018-01-22 13:27 GMT

మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి ఇండ్రస్ట్రీలో డీఆర్ఐ సోదాలు చేస్తోంది. బ్రాహ్మణి ఇండ్రస్ట్రీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఓబులాపురం మైనింగ్ కు చెందిన 189 కోట్ల రూపాయల మిషనరీని అధికారులు సీజ్ చేశారు. 2009లో గాలి జనార్థన్ రెడ్డి విదేశాల నుంచి అత్యాధునిక యంత్రసామాగ్రిని తెప్పించారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఈ మిషనరీని విదేశాల నుంచి తెప్పించినట్లు అధికారులు కనుగొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లింకుండానే గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించారు. అధికారులు నోటీసులు ఇచ్చినా గాలి పట్టించుకోలేదు. కడపలోని బ్రాహ్మణి స్టీల్స్ లోని మైనింగ్ మిషనరీని అధికారులు సీజ్ చేయడంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.

Similar News