తెలంగాణ సీఎం ముందస్తు అంచనాలు వేయడంలో ఆరితేరిన వారు. తెలంగాణ ఉద్యమ సమయంలోను ఆయన వ్యూహాలు చక్కగా పనిచేసి అన్ని పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులపై మాటల దాడి చేస్తూ తిట్టని తిట్టు లేదు. రాష్ట్ర విభజన తరువాత తాను అన్న మాటలన్నీ తెలంగాణ సాధన కోసం తప్ప మరేమి కాదని ఆంధ్రులను కడుపులో పెట్టుకు చూసుకుంటా అని భరోసా ఇచ్చారు. ఇవన్నీ ఆయనకు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఇదే వ్యూహాన్ని కేసీఆర్ పై ప్రయోగిస్తోంది. గత ఏడాదిగా ఈ వైనం గమనించిన గులాబీ బాస్ ప్రత్యర్థుల నోళ్ళకు తాళం వేయించేందుకు ఒక జీవో తెచ్చారు. దాని ప్రకారం తెలంగాణ లో అభ్యంతరకరంగా ఎవరు మాట్లాడినా పోలీసులు కేసులు పెట్టి నేరుగా జైల్లో పడేయొచ్చు. ఇది అమల్లోకి వచ్చాక రాబోయే ఎన్నికల్లో అధికారపార్టీ కి మేలు చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు సంబరపడినంత సమయం పట్టలేదు వారి సంతోషం ఆవిరి అయిపోవడానికి.
కేటిఆర్ రూల్స్ తప్పారు ...
ఇటీవల కాంగ్రెస్ దూకుడు కు చెక్ పెట్టేందుకు మంత్రి కేటీఆర్ జోరు పెంచారు. అభ్యంతరకర భాషతో టి కాంగ్రెస్ పై కేటీఆర్ లోఫర్ పార్టీ అని, లత్కోరు, లఫంగా, లంగా గాళ్ళు అంటూ ఇంకా అనేక బూతులు విరివిగా బహిరంగ సభ వేదికలపై వాడేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలంతా మూకుమ్ముడిగా కేటీఆర్ పై పడిపోయారు. ఆయన పది బూతులు వాడితే 100 బూతులతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. దాంతో కేసీఆర్ ప్రత్యర్థులపై తన కొత్త అస్త్రం ప్రయోగించాలంటే ముందుగా తన కుమారుడిపైనే ప్రయోగించాలి. దాంతో ఇప్పుడు తన వారికి, ప్రత్యర్థులకు ఒకే రూల్ పాటిస్తూ జరుగుతున్న బూతు పురాణం నిశ్శబ్దంగానే గులాబీ బాస్ తిలకించాలిసి వస్తుంది. ఏడాది ముందే ఇన్ని తిట్లు టి పాలిటిక్స్ లో నడుస్తుంటే భవిష్యత్తులో ఇంకెన్ని వినాలిసి వస్తుందో జనం.