రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఒకరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ కేవీపీ రాజ్యసభలో గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడంతో కేవీపీని సస్పెండ్ చేశారు.