అమిత్ షా కొడుకు మాటేంటి?

Update: 2018-03-25 13:34 GMT

మోడీ ప్రభుత్వం విలువలు లేకుండా వ్యవహరిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో, యూపీరాజ్యసభ ఎన్నికల్లో విలువలకు తిలోదకాలిచ్చిన బీజేపీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తుందన్నారు. ఆయన ఆరోజు ముఖ్యనేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. ప్రజల ఆలోచనల మేరకే తాము ఎన్డీఏ నుంచి బయటకు వస్తే తమపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజకీయ దురుద్దేశాలను తమకు ఆపాదించాలని చూస్తున్నారన్నారు. తమపై కేసులు పెడతారన్న వార్తలు వస్తున్నాయని, మరి అమిత్ షా కొడుకు జై షా అక్రమాల మాటేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలకు అమిత్ షా సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. తమ పార్టీ విలువలకు కట్టుబడి ఉందని, అందుకే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మూడో సీటు కోసం పోటీ పెట్టలేదని చెప్పారు.

Similar News