యూసుఫ్ గూడలో దారుణం

Update: 2018-05-28 14:24 GMT

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున దారుణం జరిగింది. యూసుఫ్ గూడలోని వన్ గ్రాం బంగారం షాపులో యువతిని గొంతుకోసి కిరాతకంగా చంపాడు ఓ యువకుడు. ఆమె పేరు వెంకట లక్ష్మి. వయస్సు 19 ఏళ్లు. యూసుఫ్ గూడ ప్రధాన సెంటర్ లో ఉన్న ఈ దుకాణానికి వచ్చింది వెంకటలక్ష్మి. అప్పటికే యువతిని ఫాలో అవుతున్న యువకుడు షాపులోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి గొంతుకోశాడు. రక్తపు మడుగులో పడిన ఆ యువతి.. అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. వస్తువుల కొనుగోలు చేయటానికి వెంకటలక్ష్మి షాపుకి వచ్చిందని చెబుతున్నారు.హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. హత్య చేసింది ఎవరనేది సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆ యువకుడి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News