గవర్నర్ ప్రసంగం… అబద్ధాల కరపత్రం

రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తో 40 పేజీ అబద్ధాలతో ఉన్న టీడీపీ కరపత్రాన్ని ఇవాళ అసెంబ్లీలో చదివించారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి [more]

Update: 2019-01-30 09:05 GMT

రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తో 40 పేజీ అబద్ధాలతో ఉన్న టీడీపీ కరపత్రాన్ని ఇవాళ అసెంబ్లీలో చదివించారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్వీడన్, జపాన్, సింగపూర్ కన్నా ఏపీ ఆర్థిక వృద్ధి చెందినట్లుగా గవర్నర్ చేత చదివించారని పేర్కొన్నారు. జగన్ నవరత్నాలను కూడా దొంగలించి గవర్నర్ తో చదివించారని ఆరోపించారు. అవినీతి రహితంగా ఆంధ్రప్రదేశ్ పాలన ఉందని చెప్పడం హాస్యాస్పదమని… ఈ ఐదేళ్లలో బడ్జెట్ కంటే కూడా ఎక్కువ దోపిడీ జరిగిందని ఆరోపణలు కూడా తాము భయటపెట్టామని, ఇసుక, క్వారీలను ఇష్టమున్నట్లు దోపిడీ చేశారని పేర్కొన్నారు.

Tags:    

Similar News