బాబు, పవన్ చీకటి ఒప్పందం

పవన్ కల్యాణ్, చంద్రబాబు చీకటి ఒప్పందానికి వచ్చారని వైసీపీ నేత పార్థసారధి అన్నారు. రాజధానిలో నారాయణకు భూములు లేవా? అని పార్థసారథి ప్రశ్నించారు. రాజధానిలో ఇన్ సైడర్ [more]

Update: 2019-08-31 14:19 GMT

పవన్ కల్యాణ్, చంద్రబాబు చీకటి ఒప్పందానికి వచ్చారని వైసీపీ నేత పార్థసారధి అన్నారు. రాజధానిలో నారాయణకు భూములు లేవా? అని పార్థసారథి ప్రశ్నించారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమని పార్థసారధి చెప్పారు. పవన్ కల్యాణ్ ఇంకా టీడీపీని పట్టుకునే వేలాడుతున్నారని తెలిపారు. రాజధాని విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని పార్థసారధి చెప్పారు. రాజధాని నిర్మాణం రెట్టింపు వ్యయం అవుతుందని కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. లింగమనేని భూములను ఎందుకు భూసేకరణ నుంచి మినహాయించారో చెప్పాలన్నారు.

Tags:    

Similar News