విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ పలువురికి గాయాలు

విశాఖపట్నంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. విశాఖలోని రామకృష్ణాపురంలో పలు అభివృద్ధి పనులకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. [more]

Update: 2020-06-15 06:53 GMT

విశాఖపట్నంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. విశాఖలోని రామకృష్ణాపురంలో పలు అభివృద్ధి పనులకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమపై దాడికి నిరసనగా రామకృష్ణబాబు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News