చాద‌ర్ స‌మ‌ర్పించిన వైఎస్ జ‌గ‌న్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పులివెందుల‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. రెండురోజులుగా త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఉంటున్న ఆయ‌న ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లను, [more]

Update: 2019-05-16 12:49 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పులివెందుల‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. రెండురోజులుగా త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఉంటున్న ఆయ‌న ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లను, పార్టీ శ్రేణుల‌ను క‌లుస్తున్నారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు జ‌గ‌న్ ను క‌లిసి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్నారు. నిన్న వివాహ వేడుక‌ల‌కు, ఇఫ్తార్ విందుకు హాజ‌రైన జ‌గ‌న్ ఇవాళ క‌డ‌ప వెళ్లారు. క‌డ‌ప అమీన్ పీర్ ద‌ర్గాను సంద‌ర్శించిన ఆయ‌న చాద‌ర్ స‌మ‌ర్పించి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు స‌మ‌ర్పించారు. త‌ర్వాత ఆయ‌న క‌డ‌ప ఎమ్మెల్యే అంజాద్ పాషా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొన‌నున్నారు. రేపు జ‌గ‌న్ తిరిగి హైద‌రాబాద్ రానున్నారు.

Tags:    

Similar News