షర్మిల అరెస్ట్.. తర్వాత మళ్లీ దీక్ష

ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ముగిసింది. తెలంగాణలో నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే పోలీసులు మాత్రం [more]

Update: 2021-04-16 00:52 GMT

ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ముగిసింది. తెలంగాణలో నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే పోలీసులు మాత్రం ఒకరోజు మాత్రమే వైఎస్ షర్మిల దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో సాయంత్రం ఆరుగంటలకు వైఎస్ షర్మిల దీక్షను విరమించారు. కాలినడకన ఇందిరా పార్కు నుంచి లోటస్ పాండ్ కు బయలుదేరి వెళ్లారు. దీంతో పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద వైఎస్ షర్మిల సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమె ను పోలీసు జీపులో తరలించారు. లోటస్ పాండ్ లో మరో రెండు రోజులు వైఎస్ షర్మిల దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News