నేడు నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల

తెలంగాణ వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నిరుద్యోగు సమస్యపై ఆమె దీక్ష చేయనున్నారు. నల్లగొండ జిల్లాల చుండూరు మండలం పుల్లెంల [more]

Update: 2021-07-27 04:41 GMT

తెలంగాణ వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నిరుద్యోగు సమస్యపై ఆమె దీక్ష చేయనున్నారు. నల్లగొండ జిల్లాల చుండూరు మండలం పుల్లెంల గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్నారు. ఈ గ్రామంలో ఇటీవల నిరుద్యోగ యువకుడు శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇక్కడ దీక్ష చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్ష చేపట్టారు. సాయంత్రం వరకూ వైఎస్ షర్మిల దీక్ష కొనసాగనుంది.

Tags:    

Similar News