అభయం యాప్ ను ప్రారంభించిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభయం యాప్ ను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా దీనిని విశాఖ జిల్లాలో ఎంపిక చేశారు. ప్రవేటు క్యాబ్ లు, ఆటోల్లో ప్రయాణించే [more]

Update: 2020-11-23 07:57 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభయం యాప్ ను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా దీనిని విశాఖ జిల్లాలో ఎంపిక చేశారు. ప్రవేటు క్యాబ్ లు, ఆటోల్లో ప్రయాణించే వారికి ఈ అభయం యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇది అమలు జరుగుతుందని తెలపారు. ఆటోలు, క్యాబ్ లు ట్రాకింగ్ కోసం ఈ యాప్ ఉపయోగపడుతుందని జగన్ చెప్పారు. మహిళల భద్రత కోసమే ఈ యాప్ ను ప్రారంభించినట్లు జగన్ వివరించారు. ఆటోలో పానిక్ బటన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పానిక్ బటన్ నొక్కితే వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారని జగన్ వివరించారు. మొత్తం లక్ష వాహనాలకు ఈ యాప్ ను విస్తరింప చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ తెలిపారు.

Tags:    

Similar News