జగన్ షెకావత్ తో భేటీ.. రాయలసీమ ఎత్తిపోతలపై?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెండోరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి [more]

Update: 2020-09-23 04:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెండోరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి నాలుగువేల కోట్ల రూపాయల పెండింగ్ నిధులను విడుదల చేయాలని జగన్ కోరారు. పోలవరంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కూడా జగన్ షెకావత్ తో చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిబంధనలను అనుసరించే ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతున్నామని షెకావత్ కు జగన్ వివరించినట్లు తెలిసింది. అపెక్స్ కమిటీలో పాల్గొనే ముందే జగన్ షెకావత్ కు దీనిపై వివరించారంటున్నారు.

Tags:    

Similar News