యాప్ ను ప్రారంభించిన జగన్

శాంతిభద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పోలీసు సర్వీస్ యాప్ ను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజలు పోలీస్ [more]

Update: 2020-09-21 06:44 GMT

శాంతిభద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పోలీసు సర్వీస్ యాప్ ను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లే పనిలేకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈయాప్ ద్వారా 87 రకాల సేవలు అందుతాయని జగన్ అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల ను అనుసంధానిస్తూ ఈ యాప్ ను రూపొందించారని చెప్పారు. మొబైల్ నుంచే స్టేషన్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా, తమ ఫిర్యాదు స్టేటస్ ను చెక్ చేసుకునే వీలుందని జగన్ తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే ఈ యాప్ ను రూపొందించామని జగన్ చెప్పారు.

Tags:    

Similar News