జగన్ కు ఇరవై ఏళ్ల క్రితం విషయాన్ని గుర్తు చేసిన మహిళ

ఇరవై ఏళ్ల క్రితం సంఘటనను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక మహిళ గుర్తు చేసింది. కడప జిల్లాకు చెందిన మహిళ మాట్లాడుతూ కడపలో శ్రీనివాస స్వీట్ [more]

Update: 2020-09-11 07:19 GMT

ఇరవై ఏళ్ల క్రితం సంఘటనను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక మహిళ గుర్తు చేసింది. కడప జిల్లాకు చెందిన మహిళ మాట్లాడుతూ కడపలో శ్రీనివాస స్వీట్ షాపు వద్ద తనకు జగన్ రెండు వందలు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కడప జిల్లాకు చెందిన మహిళ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల క్రితం జగన్ కడపలోని శ్రీనివాస స్వీట్ షాప్ కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జగన్ స్వీట్లను కొనుగోలు చేయడానికి వచ్చి తనకు రెండు వందలు స్వీట్లు కొనుక్కోమని ఇచ్చిన విషయాన్ని ఆమె తెలిపారు. ఆరోజు రాఖీ పండగ అని, తనను సోదరిగా భావించి ఆరోజు మీరు ఇచ్చిన 200 రూపాయలను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానని, ఆసరా పథకం ద్వారా ఇస్తున్న వేలాది రూపాయలతో మీరు లక్షలాది మందికి ఎప్పటికీ గుర్తుండి పోతారని మహిళ చెప్పారు. మహిళలకు ఇస్తున్న చేయూత గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని ఆమె అన్నారు.

Tags:    

Similar News