జగన్ మరో కీలక నిర్ణయం.. కరోనా బాధితులకు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మరణాలను తగ్గించేందుకు ప్లాస్మా దాతలకు ప్రోత్సహకాలను జగన్ ప్రకటించారు. కరోనా నివారణ చర్యలపై జగన్ సమీక్ష [more]

Update: 2020-07-31 08:40 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మరణాలను తగ్గించేందుకు ప్లాస్మా దాతలకు ప్రోత్సహకాలను జగన్ ప్రకటించారు. కరోనా నివారణ చర్యలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ప్లాస్మా దాతలకు ఒక్కొక్కరికీ ఐదు వేలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఆసుపత్రిలో బెడ్స్ సమాచారం అందుబాటులో ఉంచాలని కోరారు. ఒకవేళ ఆసుపత్రిలో బెడ్స్ లేకుంటే సమీప ఆసుపత్రిలో కేటాయించాలని జగన్ ఆదేశించారు. కరోనా పరీక్షలు వేగవంతంగా జరుగుతున్నాయని, కేసుల సంఖ్య ఎక్కువైనా భయపడాల్సిన పనిలేదని జగన్ అభిప్రాయపడ్డారు. టెస్ట్ లు ఎక్కువ చేసి కోవిడ్ గా నిర్ధారణ అయిన వారిని వెంటనే హోం ఐసోలేషన్ కు గాని, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News