జగన్ మంత్రివర్గ విస్తరణకు రెడీ… ఎప్పుడంటే?

వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22వ తేదీన వైఎస్ జగన్ తన కేబినెట్ లో మరికొందరికి చోటు కల్పించనున్నారు. పిల్లి సుభాష్ [more]

Update: 2020-07-03 01:25 GMT

వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22వ తేదీన వైఎస్ జగన్ తన కేబినెట్ లో మరికొందరికి చోటు కల్పించనున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపిక కావడంతో మంత్రివర్గాన్ని విస్తరించాల్సి వచ్చింది. ఈ నెల22వ తేదీన ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయతే రాజీనామా చేసిన ఇద్దరి స్థానంలో మరో ఇద్దరికి మాత్రమే జగన్ అవకాశమిస్తారా? లేక కేబినెట్ లో కొందరిని తొలగించి మరికొందరికి అవకాశమిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆషాఢమాసంలో మంత్రి వర్గ విస్తరణ చేయడం సరికాదని భావించిన జగన్ శ్రావణమాసంలో విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు.

Tags:    

Similar News