ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్

ఇసుక అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు [more]

Update: 2020-05-22 02:48 GMT

ఇసుక అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ తవ్వకాలపై ఇన్వాల్వ్ అయినట్లు ఆరోపణలు రావడంతో వారిపై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరుడు ఇసుక అక్రమ తవ్వకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. ఆ ఎమ్మెల్యేను జగన్ పిలిచి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అలాగే అక్రమ మద్యం, ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విషయంలో తాను జోక్యం చేసుకోబోనని కూడా జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఎక్సైజ్ అధికారులను ఎస్ఈబీకి బదిలీ చేయడం విషయంలో పునరాలోచించాలని కొందరు జగన్ కోరగా ఈవ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News