ఎల్జీ పరిశ్రమపై క్లారిటీ ఇచ్చిన జగన్

ప్రమాదకరమైన పరిశ్రమలను రాష్ట్రంలో గుర్తించాలని, వాటిని తరలించేందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా [more]

Update: 2020-05-12 03:14 GMT

ప్రమాదకరమైన పరిశ్రమలను రాష్ట్రంలో గుర్తించాలని, వాటిని తరలించేందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిశ్రమలను తనిఖీ చేసి ప్రమాదకరమైన వాటిని గుర్తించి నివేదిక ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఎల్జీ పాలిమర్స్ తరహాలో మరెక్కడా అటువంట ఘటనలు చోటు చేసుకోకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు చెప్పారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదకరమైన పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని జగన్ చెప్పారు. దీంతో ఎల్జీ పరిశ్రమను కూడా ఖచ్చితంగా జగన్ తరలించే యోచనలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News