జగన్ ఆదేశం.. ఈరోజే చెల్లించాలంటూ?

గ్యాస్ లీక్ బాధిత కుటుంబాలకు ఈరోజే పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే [more]

Update: 2020-05-10 13:06 GMT

గ్యాస్ లీక్ బాధిత కుటుంబాలకు ఈరోజే పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రకటించి కేవలం మూడు రోజులే అవుతుంది. అయినా ప్రభుత్వం నిన్ననే పరిహారం బాధితులకు అందించడం కోసం ముప్పయి కోట్లు విడుదల చేసింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ పన్నెండు మందికి ఈరోజే సాయం అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రెండు రోజులకంటే పైన ఉన్న వారికి లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. దీనిని రేపు పరిహారం చెల్లించాలని జగన్ అధికారులను కోారు. విశాఖ గ్యాస్ లీక్ పరిస్థితిని జగన్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News