మంత్రివర్గ సమావేశంలో జగన్

మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల [more]

Update: 2020-02-12 03:32 GMT

మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఇరవై ఏడు రోజుల నుంచి ఇరవై రోజులకు కుదించే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నం తరలింపు అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోదీతో జరగనున్న బేటీలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కూడా జగన్ తన మంత్రి వర్గ సహచరులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, ప్రధానికి ఇవ్వాల్సిన వినతిపత్రంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

Tags:    

Similar News